అందుకే జనాల మధ్యకు వెళ్లా!
- 'మంత్ర 2' హీరో చేతన్ చీను
''సినిమా చేశామా.. మన పని అయిపోయిందా''... అన్న చందంగా ఉంటారు కొంతమంది. కానీ, ఆ సినిమా సరిగ్గా జనాల్లోకి వెళ్లిందా? ఒకవేళ వెళ్లకపోతే తమ వంతుగా ఏం చేయాలి? అని ఆలోచించే నటీనటులు కొంతమంది ఉంటారు. యువహీరో చేతన్ చీను ఈ కోవకు చెందినవాడే. 'అంజలి' చిత్రంలో బాలనటుడిగా నటించిన చేతన్ చీను ఇటీవల విడుదలైన 'మంత్ర 2' ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం స్వయంగా కొన్ని జిల్లాలు వెళ్లాడు చేతన్. తన స్వస్థలం అమలాపురం వెళ్లి, అక్కడివాళ్లతో సందడి చేశారు. ఇక, ప్రేక్షకుల దగ్గరికెళ్లినప్పుడు వాళ్లు స్పందించిన వైనాన్ని చేతన్ మాటల్లోనే విందాం..
"ఈ పర్యటన నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వెళ్లిన పత్రి చోటా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు'' అని చేతన్ చెబుతూ - "తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించాను. రాజమండ్రిలోని అశోక మహల్ థియేటర్, యానాంలోని పద్మజ థియేటర్, కాకినాడ సంగీత్ థియేటర్లకు వెళ్లాను. బాగా యాక్ట్ చేశారని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందం అనిపించింది. ఇక, అంబాజీపేట నుంచి అమలాపురం వరకు 200 నుంచి 300 బైక్స్, 50 కార్లతో ప్రేక్షకులు ర్యాలీగా వచ్చిన వైనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అదే విధంగా అమలాపురంలో మెయిన్ రోడ్ సెంటర్ నుంచి థియేటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు పదిహేను మంది వేదపండితులు పూర్ణ కుంబంతో స్వాగతం పలకడం ఓ మర్చిపోలేని అనుభూతి. మర్నాడు రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణగారు నన్ను ఎస్.కె.వి.టి. కాలేజీలో వేలమంది స్టూడెంట్స్ మధ్య సత్కరించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇలా ఒక్కణ్ణే సినిమా ప్రచార బాధ్యతను తీసుకోవడం కరెక్టో తప్పో నాకు తెలియదు కానీ, నేను నటించిన సినిమా నిలబడాలనే సదుద్దేశంతోనే ఈ పర్యటన చేశాను. ఈ పర్యటన సజావుగా సాగడానికి సహాయం చేసినవాళ్లకి పేరు పేరునా కతజ్ఞతలు. త్వరలో వచ్చే నా సినిమా 'రాజుగారి గది' ప్రచార కార్యక్రమాలను కూడా ఇలానే చేయాలని ఉంది'' అన్నారు
"ఈ పర్యటన నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వెళ్లిన పత్రి చోటా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు'' అని చేతన్ చెబుతూ - "తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించాను. రాజమండ్రిలోని అశోక మహల్ థియేటర్, యానాంలోని పద్మజ థియేటర్, కాకినాడ సంగీత్ థియేటర్లకు వెళ్లాను. బాగా యాక్ట్ చేశారని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందం అనిపించింది. ఇక, అంబాజీపేట నుంచి అమలాపురం వరకు 200 నుంచి 300 బైక్స్, 50 కార్లతో ప్రేక్షకులు ర్యాలీగా వచ్చిన వైనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అదే విధంగా అమలాపురంలో మెయిన్ రోడ్ సెంటర్ నుంచి థియేటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు పదిహేను మంది వేదపండితులు పూర్ణ కుంబంతో స్వాగతం పలకడం ఓ మర్చిపోలేని అనుభూతి. మర్నాడు రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణగారు నన్ను ఎస్.కె.వి.టి. కాలేజీలో వేలమంది స్టూడెంట్స్ మధ్య సత్కరించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇలా ఒక్కణ్ణే సినిమా ప్రచార బాధ్యతను తీసుకోవడం కరెక్టో తప్పో నాకు తెలియదు కానీ, నేను నటించిన సినిమా నిలబడాలనే సదుద్దేశంతోనే ఈ పర్యటన చేశాను. ఈ పర్యటన సజావుగా సాగడానికి సహాయం చేసినవాళ్లకి పేరు పేరునా కతజ్ఞతలు. త్వరలో వచ్చే నా సినిమా 'రాజుగారి గది' ప్రచార కార్యక్రమాలను కూడా ఇలానే చేయాలని ఉంది'' అన్నారు
No comments:
Post a Comment